ప్రతీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:11 PM
ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎద గాలని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు.
![ప్రతీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి](https://media.andhrajyothy.com/media/2024/20240227/11_DVK_27_c5760faac7.gif)
- పది విద్యార్థుల ప్రేరణా తరగతుల్లో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి
దేవరకద్ర, జనవరి 27 : ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎద గాలని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల్లోని ప్రభుత్వ పాఠ శాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు శ్రీనివాస గార్డెన్లో ప్రేరణ తరగతులు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ విద్యార్థి కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. చదువుపట్ల శ్రద్ధ వహించి వదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ప్రతీ ఒక్కరు కష్టపడి చదివితే తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. శిక్షణ అభ్యర్థులు వారికి పదవ తరగతి పరీక్షలు తొందరలోనే ఉండటంతో వారిక ప్రత్యేక శిక్షణ కల్పించారు. సమయం వృధా చే యకుండా కష్టపడి చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధి కార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, పార్టీ మండల అఽధ్యక్షుడు అంజిల్రెడ్డి, రాఘవేంద ర్రెడ్డి, వివిధ మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.