Share News

మేనత్త అయినా పార్టీ కోసమే పని చేస్తా

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:12 PM

ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎన్నికై ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

మేనత్త అయినా పార్టీ కోసమే పని చేస్తా
మాట్లాడుతున్న నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, చిత్రంలో జడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డి

- ‘పేట’లో నాకన్నా ఎక్కువ మెజారిటీ ఎంపీ ఎన్నికలో ఇస్తా

- నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25 : ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎన్నికై ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, పార్టీకోసం ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్‌, గద్వాల, నారాయణపేట జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు వరుసగా స్వర్ణాసుధాకర్‌రెడ్డి, సరిత, వనజ, వంశీచంద్‌రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలుచేసేందుకు ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ తనకు మేనత్త అయినం త మాత్రాన కాంగ్రెస్‌ నుంచి గెలిచిన తాను ఆమెకు ఎలా మద్దతు ఇస్తానని ప్రశ్నించారు. చాలామందిలో ఈ అపోహ ఉన్నదని, ఎవరూ అలాంటివి పెట్టుకో వద్దని ఖచ్చితంగా తాను పార్టీ కోసమే పనిచేస్తాని పర్ణికారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి సాగునీరందించేందుకు నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలను తీసుకువచ్చినందుకు కష్ఠపడి పనిచేసి ఆయన రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు ఎంత మెజారిటీ వచ్చిందో వంశీచంద్‌రెడ్డికి పార్లమెంట్‌ ఎన్నికలో అంతకన్నా ఎక్కువ మెజారిటీ తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడితేగాని వంశీచంద్‌రెడ్డి యువజన కాంగ్రెస్‌ నుంచి సీడబ్ల్యూసీ వరకు వెళ్లారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించారని, మరోసారి ఎంపీ ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించి పాలమూరు అభివృద్దిలో భాగస్వామ్యం అవుదామన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:12 PM