ఎస్సార్ జయకేతనం
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:49 AM
ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు మరోమారు తిరుగులేని జయకేతనం ఎగురవేశారని ఆ విద్యా సంస్థల ఛైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు. అత్యుత్తమ
వరంగల్ ఎడ్యుకేషన్, ఏప్రిల్ 24: ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు మరోమారు తిరుగులేని జయకేతనం ఎగురవేశారని ఆ విద్యా సంస్థల ఛైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతో్షరెడ్డిలతో కలిసి వరదారెడ్డి బుధవారం అభినందించారు. ఎంపీసీ ఫస్టియర్ విభాగంలో మేడిశెట్టి నాగహర్షిత, కందుకూరి అనూషతోపాటు మరో 11 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించారు. అలాగే బైపీసీలో చెన్న వినయ్కుమార్తోపాటు మరో ఇద్దరు 438 మార్కులు సాధించారు. ఎంఈసీలో ఇద్దరు విద్యార్థులు 495 మార్కులు సాధించగా, సీఈసీలో ముగ్గురు విద్యార్థులు 490కి పైగా మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండియర్లో ఎస్.నందిత 993 మార్కులు సాధించగా మరో 13 మంది 990 మార్కులకు పైగా సాధించారు. బైపీసీలో వి.తేజస్విని 992 మార్కులు సాధించగా మరో ఇద్దరు 990 మార్కులు సాధించారు.