పెనగంచిప్రోలులో ఎల్లయ్య కారు లభ్యం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:32 PM
: సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు ఎల్కారం గ్రామవాసి వడ్డె ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ త్వరలోనే వీడ నుంది. ఎల్లయ్య ఈ నెల 18వ తేదీ నుంచి కన్పించకుండా పోయాడు.
సూర్యాపేటక్రైం, ఏప్రిల్ 25: సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు ఎల్కారం గ్రామవాసి వడ్డె ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ త్వరలోనే వీడ నుంది. ఎల్లయ్య ఈ నెల 18వ తేదీ నుంచి కన్పించకుండా పోయాడు. ఇప్పటివరకు ఆయ న ఆచూకీ లభించలేదు. డబ్బుల పంచాయితీ విషయంలో ఓ మహిళ ఎల్లయ్యను జగ్గయ్య పేటకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎల్లయ్య సంబంధించిన మహిళా కన్పించకుండా పోయింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులతో పాటు సూర్యాపేట పోలీసులు కూడా పలు బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా పలువురు అను మానితుల సెల్ఫోన్ సిగ్నల్స్, వారి వాహనాల రాకపోకల వివరాలు సేకరిం చినట్లు సమాచారం. కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసు కొని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎల్లయ్య జగ్గయ్యపేటకు వెళ్లేం దుకు సూర్యాపేటకు చెందిన కట్టెకోత మిషన్ యజమాని కారు తీసుకెళ్లాడు. ఆ కారు పెనుగ్రంచిపోలు మండల పరిధిలోని జాతీయ రహదారి సమీపంలోని ఓ ఫ్యాక్టరీ పక్కన ఉన్నట్లు జగ్గయ్యపేట పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఎల్లయ్యను హత్యచేసి మృతదేహం దొరకకుండా ఎక్కడో పడవేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లభించిన ఆధారాల ప్రకారం నిందితులను త్వరలోనే పట్టుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.