బార్ అసోసియేషన్ల కమిటీల ఎన్నిక
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:53 PM
న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి ప్రస్తుతమున్న అధ్యక్ష, కార్యదర్శులే ఎన్నికయ్యారు.
- మహబూబ్నగర్లో సుదర్శన్రెడ్డి, రాంనాథ్గౌడ్ గెలుపు
మహబూబ్నగర్ లీగల్కంట్రిబ్యూటర్, మార్చి 28 : న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి ప్రస్తుతమున్న అధ్యక్ష, కార్యదర్శులే ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎ. సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్య దర్శిగా బి.రాంనాథ్గౌడ్లు ఎన్నికయ్యారు. అదేవిధంగా కోశాధికారిగా ఎ.శివరాజు ఎన్నికయ్యారు. గురువారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాల యంలో న్యాయవాదుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. రెండు ప్యానెళ్లు ఎన్నికలో పోటీ పడ్డాయి. 403 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యాయవాదులు ఇరు ప్యానెల్ అభ్యర్థు లను గెలిపించుకునేందుకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. సాధారణ ఎన్నికల తరహాలో నువ్వానేనా అన్నట్లు అభ్యర్థుల మధ్య పోరు సాగింది. న్యాయవాదులు ప్రస్తుతం ఉన్న అధ్యక్ష, కార్యదర్శులకే మరోసారి అవకాశం కల్పించారు. అధ్యక్ష పదవి కోసం సుదర్శన్రెడ్డి, రవికుమార్ యాదవ్లు పోటీపడ్డారు. సుదర్శన్రెడ్డికి 235 ఓట్లు పోలవగా రవికుమార్ యాదవ్కు 164 ఓట్లు వచ్చాయి. సుదర్శన్రెడ్డి 71 ఓట్ల ఆధిక్యంతో విజ యం సాధించారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవికోసం ముగ్గురు తలప డ్డారు. బి రాంనాథ్గౌడ్, డి.నర్సింహారెడ్డి, ఎస్.లక్ష్మారెడ్డి మధ్య సాగిన పోరులో రాంనాథ్గౌడ్కు 207 ఓట్లు రాగా నర్సింహారెడ్డికి 124, లక్ష్మారెడ్డికి 68 ఓట్లు రాగా, రాంనాథ్గౌడ్ 83 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కోశాధికారి పదవికోసం శివరాజు, వెంకట్రావులు తలప డగా శివరాజుకు 217 ఓట్లు రాగా, వెంకట్రావుకు 187 ఓట్ల పడ్డాయి. వీరిద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ నడి చింది. 40 ఓటర్లతో శివరాజు విజయం సాధించారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా శ్రీరామ్గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కె.నాగోజి, గ్రంథాలయ కార్యదర్శిగా కెఎస్ మల్లికార్జున్, కార్యవర్గ సభ్యులుగా కరుణకాంత్, ఇలియాస్ హుస్సేన్, నరేందర్నాయక్, నరేశ్గౌడ్, రమేశ్, సాహితి శివానంద్, ఉత్తమ్కుమార్, వినోద్కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. విజయం సాధించిన తరువాత గెలుపొందిన నూతన కమిటీని న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. న్యాయవాదుల సహకార సంఘం అధ్యక్షులు ఆనందరావు, చంద్రమౌళి, అనంతరెడ్డి, మాజీ సహకారసంఘం అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఏజీపీ మనోహర్, ఏపీపీ బాలస్వామి, స్వదేశి, మహిళా న్యాయవాదులు ఉమామహేశ్వరి, రాధలు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
జడ్చర్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.జంగయ్య
జడ్చర్ల బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె.జంగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జడ్చర్ల బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారిగా ఉదయరాజు పర్యవేక్షించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె.జంగయ్య, ఉపాధ్య క్షుడిగా యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాపో తుల శ్రీనివాస్గౌడ్, కార్యదర్శిగా రాములు, కోశా ధికారిగా శ్రీశైలం, లైబ్రరీ కార్యదర్శిగా అమీను ద్దీన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా శ్రీనివా స్, ఈసీ సభ్యులుగా శ్రీకాంత్, రఘురాం, హఫీ స్బీలను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. న్యాయ వాదుల సంఘం నూతన అధ్యక్షుడు జంగయ్య తో పాటు కార్యవర్గానికి జడ్చర్ల న్యాయ వాదులు అభినందనలు తెలిపారు.