ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి : జైవీర్రెడ్డి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:17 PM
ప్రభుత్వ వి ద్యను బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంద ని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి : జైవీర్రెడ్డి
తిరుమలగిరి(సాగర్), జూన 7: ప్రభుత్వ వి ద్యను బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంద ని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. మండలంలోని నెల్లికల్ గ్రామంలో శుక్రవారం నిర్వహించి న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి పా ల్గొన్నారు. నెల్లికల్ జడ్పీహెచఎ్సలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నా ణ్యమైన విద్య అందు తుందని, తమ పిల్లలను ఆ యా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభు త్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయా లు, సౌకర్యాల మెరుగుదల కోసం తాను కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడు తూ ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా, ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చే పట్టేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్చైర్మన కర్నాటి లింగారెడ్డి, ఎంఈవో తరి రాము, ఎంఎనవో కె.శ్రీనివాస్, టీఎ్సయూటీఎ ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యాయు లు వడ్త్యా రాజు, కట్టెబోయిన సై దులు, శ్రీదేవి, కృష్ణవేణి, ఎరనాగుల సైదులు, శైలజ, మంగ, అరుణకుమారి, రాజే ష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బడిబాట కార్యక్రమం విజయవంతం చేయాలి
మునుగోడు: మునుగోడులోని పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు ఉన్నాయని, బడీఈడు పిల్లలను బడికి పం పాలని కోరుతూ గ్రామంలో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలకు పంపితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు.