Share News

సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:05 AM

మండలంలోని ప్రజాప్రతినిఽధులు అన్ని శా ఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాల ని ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి అన్నారు.

 సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి

సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి

పెద్దఅడిశర్లపల్లి, జనవరి 4: మండలంలోని ప్రజాప్రతినిఽధులు అన్ని శా ఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాల ని ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ ప్రతా్‌పరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సా దాసీదాగా జరిగింది. అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనం తరం ఎంపీపీ మాట్లాడుతూ రానున్న వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. మండలంలో విద్యుత సమస్యలు పరిష్కరించాలని విద్యుత అధికారులకు సూచించా రు. అనంతరం సర్పంచులకు చివరి సమావేశం కావడంతో ఎంపీపీ ప్రతా్‌పరెడ్డి సర్పంచులను శాలువా, పూలదండలు, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. స మావేశంలో ఎంపీడీవో అజ్మీరాదేవికా, మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:05 AM