ఆనలైన అప్రమత్తంగా చేయాలి : ఆర్డీవో
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:04 AM
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆ నలైనలో సమర్థవంతంగా నమో దు చేయాలని దే వరకొండ ఆర్డీవో శ్రీరాములు అన్నా రు.
![ఆనలైన అప్రమత్తంగా చేయాలి : ఆర్డీవో](https://media.andhrajyothy.com/media/2023/20231205/06_chitapally_09_7d9e59208e.jpg)
ఆనలైన అప్రమత్తంగా చేయాలి : ఆర్డీవో
చింతపల్లి, జ నవరి 6: ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆ నలైనలో సమర్థవంతంగా నమో దు చేయాలని దే వరకొండ ఆర్డీవో శ్రీరాములు అన్నా రు. చింతపల్లి త హసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆనలైన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రతీ గ్రామం నుంచి వందలాది దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరి దరఖాస్తును ఆనలైనలో తప్పులు లేకుండా నమోదు చేసి జిల్లా అ ధికారులకు పంపించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శంషుద్దీన, డీటీ అ ర్షద్, ఆర్ఐ యాదయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.