Share News

Kumaram Bheem Asifabad- మావోయిస్టులకు సహకరించొద్దు

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:24 PM

అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ అల్లం రాంబాబు అన్నారు. మండలంలోని లోహ గ్రామంలో ప్రజలతో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన విషయంపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు

Kumaram Bheem Asifabad-   మావోయిస్టులకు సహకరించొద్దు
గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ రాంబాబు

దహెగాం, మార్చి 26: అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ అల్లం రాంబాబు అన్నారు. మండలంలోని లోహ గ్రామంలో ప్రజలతో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన విషయంపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మావోయిస్టులకు సహకరించవద్దని, వారితో గ్రామాలు అభివృద్ధి చెందవని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని చెప్పారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు విద్యుత్‌ తీగలు అమర్చి వన్యప్రా ణులను వేటాడద్దన్నారు. అంతకు ముందు గ్రామాల్లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 10:24 PM