Share News

పెళ్లి చేసుకోమన్నారని యువకుడి అదృశ్యం

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:53 PM

పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు అన్నందుకు ఓ యువకుడు ఇంటి వెళ్లిపోయాడు.

 పెళ్లి చేసుకోమన్నారని యువకుడి అదృశ్యం
సందీప్‌ (ఫైల్‌)

పెళ్లి చేసుకోమన్నారని యువకుడి అదృశ్యం

తిప్పర్తి, మార్చి 28: పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు అన్నందుకు ఓ యువకుడు ఇంటి వెళ్లిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల ప రిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గంటకంపు కృష్ణయ్య కుమారుడు సందీప్‌ (27) 10వ తరగతి వరకు చదివి కూలీ పనులు చేసుకుంటూ తన స్వగ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. తల్లి వెంకటమ్మ ఈ నెల 27న ఉదయం ఇంట్లో ఉన్న సమయం లో నువ్వు పెళ్లి చేసుకోవాలని కుమారుడికి సూచించింది. దీంతో మనస్థాపం చెంది న సందీప్‌ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఫోన స్విచ్ఛాప్‌ చేసుకున్నాడు. దీంతో బంధువులు, అతని స్నేహితుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో తన అక్క దర్శనం రేణుక గురువారం తిప్పర్తి పోలీ్‌సస్టేషనలో ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:53 PM