Share News

peddapally{- కేంద్ర పథకాలతోనే గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:42 PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే దన్పాల్‌ సూర్మానారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం బీజేపీ చేపట్టిన సంకల్ప యాత్ర ధర్మారంకు చేరుకుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

peddapally{-  కేంద్ర పథకాలతోనే గ్రామాల అభివృద్ధి
మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్‌ సూర్యనారాయణ

ధర్మారం, ఫిబ్రవరి 25: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే దన్పాల్‌ సూర్మానారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం బీజేపీ చేపట్టిన సంకల్ప యాత్ర ధర్మారంకు చేరుకుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ యాత్రలో జాతీయ ఎస్సీ మోర్చ కార్యదర్శి ఎస్‌ కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాగిరెడ్డి మహిపాల్‌రెడ్డి, తాడ్వాయి రాంగోపాల్‌రెడ్డి,జాడీ బాల్‌రెడ్డి, మండల నాయకులు మేడవేని శ్రీనివాస్‌, సందినేని లక్ష్మణ్‌, ఎల్లాల మహేందర్‌రెడ్డి,గోనే సాయి తదితరులు పాల్గొన్నారు. కాగా బీజేపీ చేపట్టిన సంకల్పయాత్రలో ధర్మారం మండలం లోని పలు గ్రామాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కమ్మరీఖాన్‌పేట, మల్లాపూర్‌, బంజేరుపల్లి, కటికెనపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల మీదుగా ర్యాలీ కొనసాగింది.

Updated Date - Feb 25 , 2024 | 11:42 PM