అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం : ఎమ్మెల్యే వీరేశం
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:20 AM
నియోజకవర్గంలోని అన్ని గ్రా మాల్లో అభివృద్ధి పనులను చేపడతామని అభివృద్ధే కాంగ్రెస్ ప్ర భుత్వ నినాదమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
![అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం : ఎమ్మెల్యే వీరేశం](https://media.andhrajyothy.com/media/2024/20240306/10_ctlrural_1_8528982173.jpg)
అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం : ఎమ్మెల్యే వీరేశం
చిట్యాలరూరల్, మార్చి 10: నియోజకవర్గంలోని అన్ని గ్రా మాల్లో అభివృద్ధి పనులను చేపడతామని అభివృద్ధే కాంగ్రెస్ ప్ర భుత్వ నినాదమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యా ల మండలం గుండ్రాంపల్లిలోని ప్రాథమిక పా ఠశాలలో మన ఊ రు - మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన తరగతి గ దులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గుండ్రాంపల్లి, వెలిమినేడు, పేరేపల్లి, తాళ్లవెల్లంల, నేరడ గ్రామాల్లో పర్యటించి ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే వీరేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తామని, అందుకు తగిన వి ధంగా నిధులను వెచ్చిస్తామన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే నే రాష్ట్రం పురోభివృద్ధిని సాఽధిస్తుందని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని, ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆ దర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర జాప్రభుత్వమని ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను చేపడుతూ అర్హులందరికీ పథకాలు అందిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.