రాష్ట్రం ఏర్పడినా మా బతుకులు మారలేదు
ABN , Publish Date - Apr 08 , 2024 | 03:40 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇపుడు తెలంగాణలోనూ మాదిగల బతుకులు మారలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ
న్యాయం చేయాలని సీఎంను కోరిన దండోరా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇపుడు తెలంగాణలోనూ మాదిగల బతుకులు మారలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మాదిగ హక్కుల దండోరా జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడు దండు సురేందర్, కొంగరి శంకర్ ఆదివారం సీఎం రేవంత్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మాదిగలకు ప్రత్యేక ఆత్మగౌరవ భవన నిర్మాణం, టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, అన్ని ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం, సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే మాదిగలకు బ్యాంక్ అకౌంట్కు సంబంధం లేకుండా రూ.10లక్షలు ఆర్ధికసాయం చేయడంతో పాటు మూతపడిన లీడ్ క్యాప్ని వెంటనే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రిని కోరారు.