మృతదేహం లభ్యం
ABN , Publish Date - May 20 , 2024 | 12:36 AM
నల్లగొండ జిల్లా కనగల్లోని వాగు బ్రిడ్జి కింద మృతదేహం లభ్యమైంది.నల్లగొండ జిల్లా కనగల్లోని వాగు బ్రిడ్జి కింద మృతదేహం లభ్యమైంది.
![మృతదేహం లభ్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మృతదేహం లభ్యం
కనగల్, మే 19: నల్లగొండ జిల్లా కనగల్లోని వాగు బ్రిడ్జి కింద మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవం సమీపంలో ఓ బ్యాగు లభించగా అందులో దుస్తులు, ఆధార్ కార్డు లభించాయి. ఆధార్కార్డు లో సముద్రాల కృష్ణ (50) న్యూగుండ్లపల్లి, యాదగిరిగుట్ట చిరునామా ఉంది. మృతదేహం కుళ్లినస్థితిలో ఉండగా రెండు మూడు రోజుల క్రితమే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కాల్చేందుకు దుండగులు యత్నించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆధార్కార్డుపై ఉన్న చిరుమానా ప్రకారం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చండూరు సీఐ వెంకటయ్య, ఎస్ఐ రామకృష్ణగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తామని తెలిపారు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలుస్తుంది.