యూట్యూబ్ జర్నలిస్టు ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ABN , Publish Date - Jun 09 , 2024 | 11:40 PM
నల్లగొండ పట్టణానికి చెందిన యూట్యాబ్ జర్నలిస్టు ఇంటి ఎదుట కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆందోళన చేశారు.
![యూట్యూబ్ జర్నలిస్టు ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన](https://media.andhrajyothy.com/media/2024/20240604/9_Ng9_jpeg_2c86fe10f6.jpg)
యూట్యూబ్ జర్నలిస్టు ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన
నల్లగొండ కైరం, జూన 9 : నల్లగొండ పట్టణానికి చెందిన యూట్యాబ్ జర్నలిస్టు ఇంటి ఎదుట కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆందోళన చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటర్లకు ఎరచూపేందుకు కాం గ్రెస్ అభ్యర్థి నుంచి ఆయన సన్నిహితుల నుంచి డబ్బు లు తీసుకుని, అందుకు వ్యతిరేకంగా పనిచేశారని కాంగ్రె స్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఆరోపించా రు. నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. అ నంతరం సదరు జర్నలిస్టును అదుపులోకి తీసుకోవడం తో పార్టీ కార్యకర్తలు ఆందోళన విరమించారు.
విచారణ చేస్తున్నాం : ఎస్ఐ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగం గా జిల్లా కేంద్రంలో యూ ట్యూబ్ జర్నలిస్టుపై పలువు రు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఆయన శ్రేయోభిలాషుల నుం చి సుమారు రూ.43 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఆ మేరకు సదరు జర్నలిస్టును విచారిస్తున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.