Share News

కాంగ్రెస్‌ పేద వర్గాలకు అభయ హస్తం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:40 PM

కాంగ్రెస్‌ పార్టీ పే ద, బలహీన వర్గాలకు అభయ హ స్తం లాంటిదని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్‌ ని యోజకవర్గ అభ్య ర్థి కుందూరు ర ఘువీర్‌రెడ్డి అన్నా రు.

 కాంగ్రెస్‌ పేద వర్గాలకు అభయ హస్తం
అడ్డా కూలీలతో ముచ్చటిస్తున్న రఘువీర్‌రెడ్డి, బీఎల్‌ఆర్‌

కాంగ్రెస్‌ పేద వర్గాలకు అభయ హస్తం

నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి

మిర్యాలగూ డ, ఏప్రిల్‌ 18: కాంగ్రెస్‌ పార్టీ పే ద, బలహీన వర్గాలకు అభయ హ స్తం లాంటిదని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్‌ ని యోజకవర్గ అభ్య ర్థి కుందూరు ర ఘువీర్‌రెడ్డి అన్నా రు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత శంకర్‌నాయక్‌తో కలి సి ఎన్నెస్పీ గ్రౌండ్‌లో గురువారం మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసి ఓట్లను అభ్యర్థించా రు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా టీ హోటళ్లు, రైతుబజార్‌, మునిసిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద అడ్డా కూలీలను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు పేదవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ పాటుపడుతోందని అన్నారు. పదేళ్లలో బీజేపీ ప్రజల కోసం చేసిన ఒక్క మంచిపనైనా చెప్పుకోలేక పోతోందన్నారు. చివరకు రాముని పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనను బొందపెట్టిన ప్రజానీ కం దేశంలో కార్పొరేట్లకు తొత్తుగా పనిచేస్తున్న బీజేపీని గద్దెదించాలన్నారు. రా ష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుకు, దేశంలో పాంచన్యాయ పథకాల అమలుకు, రాజ్యాంగ రక్షణకు వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుపైనే ఓటు వేసి నల్లగొండ ఎం పీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, పందిరి రామకృ ష్ణ, పొదిల శ్రీనివాస్‌, తమ్మడబోయిన అర్జున, వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:40 PM