నేడు బీజేపీపై కాంగ్రెస్ చార్జిషీటు విడుదల
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:02 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీటును గురువారం విడుదల చేయనుంది. గాంధీభవన్లో ఏర్పాటు చేయనున్న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీటును గురువారం విడుదల చేయనుంది. గాంధీభవన్లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చార్జిషీటును విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు పాల్గొననున్నారు.
- హైదరాబాద్, ఆంధ్రజ్యోతి