11న సీఎం భద్రాచలం పర్యటన!
ABN , Publish Date - Mar 04 , 2024 | 04:39 AM
సీఎం రేవంత్రెడ్డి 11న భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.
![11న సీఎం భద్రాచలం పర్యటన!](https://media.andhrajyothy.com/media/2024/20240301/55_afded94ec6.jpg)
హైదరాబాద్, మార్చి 3(ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్రెడ్డి 11న భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలుత భద్రాద్రి రామయ్యను సీఎం దర్శించుకుంటారు. అనంతరం బూర్గంపాడులో నిర్వహించే సభలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తారని సమాచారం. కాగా, ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.