సీఎం రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:08 AM
సీఎం రేవంత్రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, బీజేపీలోకి పోతారని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి ఆరోపించారు.
నల్లగొండ, ఏప్రిల్ 18: సీఎం రేవంత్రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, బీజేపీలోకి పోతారని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను నిఖార్సైన ఉద్యమకారుడినని, ఫైటర్నని ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదన్నారు. పదవి నిలబెట్టుకోవడానికి ఒకరు, పదవి తెచ్చుకోవడానికి మరొకరు పొద్దున లేస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బూట్లను గుంజుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ తూడుస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులకు నడుమంత్రపు సిరి వచ్చిందని, దీంతో వారు ఆగడం లేదన్నారు. నల్లగొండ జిల్లా రైతులను మోసం చేసి సాగర్ నీటిని ఆంధ్రాకు అమ్ముకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎ్స నుంచి ముడుపులు తీసుకుని బతికారన్నారు. వైఎస్ భిక్షతో బతికిన వీళ్లు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి కోసం బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన వ్యక్తి అని అన్నారు. ‘కోమటిరెడ్డి బ్రదర్స్ ఆగర్భ శ్రీమంతులులాగా బిల్డఫ్ ఇస్తున్నారు, నా చరిత్ర ఏమిటో, మీ చరిత్ర ఏమిటో చర్చకు పెడదామా’ అని సవాల్ విసిరారు. కేసీఆర్ జోలికి వస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీచైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మందడి సైదిరెడ్డి ఉన్నారు.