బెల్ట్షాపులకు చెక్ పెట్టండి : ఎస్పీ
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:22 PM
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్ట్షాపులకు చెక్ పెట్టాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు.
![బెల్ట్షాపులకు చెక్ పెట్టండి : ఎస్పీ](https://media.andhrajyothy.com/media/2024/20240322/4npt22_d7fb180125.gif)
నారాయణపేట, మార్చి 22: పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్ట్షాపులకు చెక్ పెట్టాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర పోలీస్లతో పాటు ఎక్సైజ్ సిబ్బం దిని నియమించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా చెక్పోస్ట్ల దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉండి నగదు, బంగారం, మద్యం అక్రమంగా తరలివెళ్లకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. నకిలీ ఓటర్లను చెక్ పెట్టాలని అన్నారు. జిల్లాలో అక్ర మం నిర్వహించే బెల్ట్ షాప్లో మద్యం విక్రయా లు అరికట్టాలన్నారు. అక్రమం మద్యం నివారిం చేందుకు ప్రత్యేక నిఘా ఉంచి విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సారా, గంజా యిలకు చెక్ పెట్టాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. సమావే శంలో పేట డీఎస్పీ లింగయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధాకర్, సీఐలు అశోక్ కుమార్, బాలకృష్ణ ఎస్ఐలు రమేష్, గురువా య్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.