Share News

నామినేషన్‌ తిరస్కరణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ABN , Publish Date - May 03 , 2024 | 04:47 AM

మల్కాజిగిరిలో తన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కేవీ గీతకుమారి అనే స్వతంత్ర అభ్యర్థి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక

నామినేషన్‌ తిరస్కరణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరిలో తన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కేవీ గీతకుమారి అనే స్వతంత్ర అభ్యర్థి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వలేదని, ఫొటోగ్రాఫ్స్‌ సమర్పించలేదని, ఫారం-ఏ అసంపూర్ణంగా వదిలేశారనే మూడు కారణాలతో ఆర్వో.. పిటిషనర్‌ నామినేషన్‌ను తిరస్కరించారని ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ విషయంలో ఆర్వో ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - May 03 , 2024 | 08:08 AM