బస్సు షెల్టర్ లేక అవస్థలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:24 PM
మండల పరిధిలోని గూడెబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్ వద్ద బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థ పడుతున్నారు.

కృష్ణ, జూన్ 7: మండల పరిధిలోని గూడెబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్ వద్ద బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థ పడుతున్నారు. బస్సుల కోసం జాతీయ రహదారిపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు మండలం కావడం వల్ల వందలమంది ప్రయాణికులు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తూర్పు గోదావరి, రాజమండ్రి, బళ్లారి, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. టైరోడ్ వద్ద ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ లేకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు రోడ్డుపైనే కూర్చుంటున్నారు. బస్సు కోసం వేచి చూసే క్రమం ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు.