శంషాబాద్లో మహిళ దారుణ హత్య
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:08 AM
తీసుకున్న అప్పు తిరిగి తీర్చమన్నందుకు మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి. ఇంట్లో అద్దెకుండి... ఓనర్ వద్ద అప్పు చేసి, తిరిగివ్వమని అడిగితే
![శంషాబాద్లో మహిళ దారుణ హత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అప్పు తీర్చమన్నందుకు హత్య చేసిన నిందితుడు
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పు తిరిగి తీర్చమన్నందుకు మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి. ఇంట్లో అద్దెకుండి... ఓనర్ వద్ద అప్పు చేసి, తిరిగివ్వమని అడిగితే హతమార్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ మండలం పాల్మాకులకు చెందిన గూడెపు యాదమ్మ(40) గత నెల 27న రాళ్లగూడలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి, అదే రోజు తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఇంటికి చేరుకోలేదు. దాంతో 28న కుటుంబసభ్యులు ఆర్జీఐఏ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సంఘీగూడ గ్రామానికి చెందిన శంకరయ్య ఆమెను హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడికి యాదమ్మ అప్పు ఇవ్వగా, ఆ డబ్బులు అడిగినందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు తన పొలంలోనే మృతదేహన్ని పూడ్చినట్లు గుర్తించిన పోలీసులు తహసీల్దార్ నాగమణి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.