కల్వకుంట్ల కుటుంబానికి లిమిటెడ్ కంపెనీలా బీఆర్ఎస్
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:53 AM
కల్వకుంట్ల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ లాభాలు తెచ్చిపెట్టే లిమిటెడ్ కంపెనీగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర
![కల్వకుంట్ల కుటుంబానికి లిమిటెడ్ కంపెనీలా బీఆర్ఎస్](https://media.andhrajyothy.com/media/2023/20231205/ee_8cf19049e7.jpg)
వారి అక్రమాలను బయటకు తెస్తున్న పులి.. రేవంత్రెడ్డి
మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ లాభాలు తెచ్చిపెట్టే లిమిటెడ్ కంపెనీగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు ఎన్నెం శ్రీనివా్సరెడ్డి, ఆది శ్రీనివాస్, లక్ష్మణ్కుమార్, పర్ణిక రెడ్డి మాట్లాడారు. పార్టీ పేరు చెప్పుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పులి లాంటి రేవంత్రెడ్డి .. పిల్లి లాంటి కేసీఆర్ చేసిన అక్రమాలను బటయకు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. ఆయన రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు. సభలో హరీ్షరావు మాట్లాడే తీరు బాగలేదని అన్నారు. బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నుంచి చెప్పాపెట్టకుండా పారిపోయారని ఆరోపించారు. పెళ్లిళ్లు, పేరంటాలున్నాయని చెప్పి వారు రెండు రోజుల ముందు నుంచే సభ వాయిదావేయాలని కోరుతున్నారని అన్నారు.