Share News

రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి : పల్లా

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:29 AM

ఎన్నికల హా మీలను అమలు చేయ ని కేంద్రంలోని బీజేపీని ఓడించాలని సీపీఐ జా తీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.

 రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి : పల్లా
సమావేశంలో మాట్లాడుతున్న పల్లా వెంకట్‌రెడ్డి

రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి : పల్లా

దేవరకొండ, ఫిబ్రవరి 28: ఎన్నికల హా మీలను అమలు చేయ ని కేంద్రంలోని బీజేపీని ఓడించాలని సీపీఐ జా తీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని పల్లా పర్వతరెడ్డి భవనలో జరిగిన బుధవారం నిర్వహించిన నియోజకవర్గ సమి తి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చే యలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసి కార్పొరేట్‌ శక్తులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డి మాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించాలని, వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దేప సుదర్శనరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, నాయకు లు పల్లా దేవేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, జయరాములు, పాండురంగారెడ్డి, రామస్వా మి, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:29 AM