Share News

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:31 AM

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.

 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి

చిట్యాల, జనవరి10: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాలలో బుధవారం ని ర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు. కేం ద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన జి ల్లా, మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పి లుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు జిట్ట సరోజ, జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, మల్లం మ హేష్‌, అరూరి శ్రీను, శీలా రాజయ్య, నర్సింహ, లింగస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 06:54 AM