Share News

17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:47 AM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు రాజకీయ ఇన్‌చార్జిలను నియమించారు.

17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు రాజకీయ ఇన్‌చార్జిలను నియమించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారితోపాటు సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. త్వరలో, సంస్థాగత ఇన్‌చార్జిలను నియమించనున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉండే సీనియర్‌ నాయకులకు సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నారు. సికింద్రాబాద్‌కు లక్ష్మణ్‌, హైదరాబాద్‌కు రాజాసింగ్‌, ఆదిలాబాద్‌కు పాయల శంకర్‌, పెద్దపల్లికి రామారావు పవార్‌, కరీంనగర్‌కు ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, నిజామాబాద్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్‌కు కె.వెంకటరమణారెడ్డి, మెదక్‌కు పాల్వాయి హరీ్‌షబాబు, మల్కాజిగిరికి పైడి రాకేశ్‌రెడ్డి, చేవెళ్లకు ఎ.వెంకటనారాయణరెడ్డి, మహబూబ్‌నగర్‌కు ఎన్‌.రాంచందర్‌రావు, నాగర్‌కర్నూల్‌కు మారం రంగారెడ్డి, నల్గొండకు చింతల రాంచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, వరంగల్‌కు మర్రి శశిధర్‌రెడ్డి, మహబూబాబాద్‌కు గరికపాటి మోహన్‌రావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్‌రెడ్డిని రాజకీయ ఇన్‌చార్జిలుగా నియమించారు.

Updated Date - Jan 09 , 2024 | 06:50 AM