Share News

నేరేడుగొమ్ము ఎంపీపీగా బిక్కునాయక్‌

ABN , Publish Date - May 24 , 2024 | 11:41 PM

నేరేడుగొమ్ము మండల నూతన ఎంపీపీ గా వాంకునావత బిక్కునాయక్‌ ఎ న్నికయ్యారు.

 నేరేడుగొమ్ము ఎంపీపీగా బిక్కునాయక్‌
బిక్కునాయక్‌కు నియామకప్రతం అందజేస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్‌

నేరేడుగొమ్ము ఎంపీపీగా బిక్కునాయక్‌

చందంపేట, మే 24: నేరేడుగొమ్ము మండల నూతన ఎంపీపీ గా వాంకునావత బిక్కునాయక్‌ ఎ న్నికయ్యారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఎమ్మెల్యే బాలునాయక్‌, డివిజన పం చాయతీ అధికారి రాంమోహనరావు, ఎంపీడీవో సరోజ నియామక పత్రాన్ని అం దజేశారు. ఎంపీపీగా బిక్కునాయక్‌, వైస్‌ ఎంపీపీగా సరోజ ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. మండలంలో ఆరు ఎంపీటీసీలు ఉన్నారు. 2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలు, కాంగ్రెస్‌ రెండు స్థానాలను గెలుచుకుం ది. దీంతో ఎంపీపీగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పద్మ హనుమానాయక్‌ ఎన్నికయ్యారు. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు ఇద్దరు కాంగ్రె్‌సలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ ఎంపీటీసీల సంఖ్య నా లుగుకు చేరింది. మెజార్టీ ఉండటంతో కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్ట గా కాంగ్రెస్‌ అభ్యర్థి బిక్కునాయక్‌ మెజార్టీ అధికంగా ఉండటంతో ఎంపీపీగా ఎ న్నికయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.

Updated Date - May 24 , 2024 | 11:41 PM