ఎంఐఎం కాంగ్రెస్కు బీ టీం: కేంద్రమంత్రి ఠాకూర్
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:58 AM
‘‘తెలంగాణలో రెండెంకల స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటే.. కేంద్రలో బీజేపీ పదేళ్ల పాలనలో వివక్షకు తావులేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బీ టీంగా ఉంది.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో రెండెంకల స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటే.. కేంద్రలో బీజేపీ పదేళ్ల పాలనలో వివక్షకు తావులేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బీ టీంగా ఉంది. రాహుల్, ఒవైసీ.. ఇద్దరి విధానాలు ఒక్కటే. తుక్డె గ్యాంగులతో కలిసి కాంగ్రెస్ తన మేనిఫెస్టో తయారు చేసింది. ఆ పార్టీ దేశం వైపా.. దేశ వ్యతిరేకుల వైపా? అనేది తేల్చుకోవాలి’’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ఇతరులకు పంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. శ్యామ్ పిట్రోడా ఆలోచనలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ దందా చేసిందని.. అందువల్లనే ఆ కుటుంబ సభ్యురాలు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.