డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు
ABN , Publish Date - May 15 , 2024 | 10:22 PM
01కలెక్టరేట్15 పోస్టర్లను విడుదల చేస్తున్న డీఎంహెచ్వో అనిత డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత మంచిర్యాల కలెక్టరేట్, మే 15: డెంగ్యూ నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16న అన్ని ప్రాథమిక కేంద్రాలు, ఉప కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో జా తీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. డె ంగ్యూ నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. డెంగ్యూ నివారణలో భాగంగా గ్రామాల్లో, మున్సిపాలిటీలో పంచా యతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. ఆశ్రమ హాస్టల్లలో దోమల నివారణ మందులను పిచికారీ చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరిం టెండెంట్ హరిచంద్రరెడ్డి, అధికారులు ఇస్మాయిల్, విశ్వేశ్వర్రెడ్డి, నాందేవ్, సంతోష్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
![డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/01coll15_1a3bf2f670.gif)
మంచిర్యాల కలెక్టరేట్, మే 15: డెంగ్యూ నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16న అన్ని ప్రాథమిక కేంద్రాలు, ఉప కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో జా తీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. డె ంగ్యూ నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. డెంగ్యూ నివారణలో భాగంగా గ్రామాల్లో, మున్సిపాలిటీలో పంచా యతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. ఆశ్రమ హాస్టల్లలో దోమల నివారణ మందులను పిచికారీ చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరిం టెండెంట్ హరిచంద్రరెడ్డి, అధికారులు ఇస్మాయిల్, విశ్వేశ్వర్రెడ్డి, నాందేవ్, సంతోష్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.