Share News

భార్యతో గొడవపడి మరో యువకుడు అదృశ్యం

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:51 PM

భార్యతో గొడవపడి ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో గురువారం చో టు చేసుకుంది.

భార్యతో గొడవపడి మరో యువకుడు అదృశ్యం
అనిల్‌కుమార్‌ (ఫైల్‌)

భార్యతో గొడవపడి మరో యువకుడు అదృశ్యం

తిప్పర్తి, మార్చి 28: భార్యతో గొడవపడి ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో గురువారం చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, వినుకొండ మండలానికి చెందిన కుంట అనిల్‌కుమార్‌ (26)కు ఖ మ్మం జిల్లాకు చెందిన కుంట పవిత్రతో మూడేళ్ల క్రితం వివాహమైంది. మాడ్గులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న టోల్‌గేట్‌లో అనిల్‌కుమార్‌ ఎనిమిది నెలల క్రితం షిఫ్ట్‌ మేనేజర్‌గా జాయిన అయాడు. దీంతో దంపతులు తిప్పర్తి మం డల కేంద్రంలో ఓ గది కిరాయికి తీసుకొని నివసిస్తున్నా రు. ఎనిమిది నెలలుగా మాడ్గులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న టోల్‌గేట్‌లో షిఫ్ట్‌ మేనేజర్‌గా పని చేస్తూ భార్యతో పాటు తిప్పర్తి మండల కేంద్రంలో ఓ గది కిరాయికి తీసుకొని నివసిస్తున్నాడు. ఈ నెల 22వ తేదిన భర్త అనిల్‌ ఫోనలో ఓ గుర్తు తెలియని అమ్మాయి ఫోటో ఉండడంతో పోటో ఎవ్వరిదో చెప్పాలంటూ భార్యభర్తల మధ్య తగాద జరిగింది. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో భార్య పవిత్ర ఫోనతో పాటు తన ఫోన కూడా తీసుకొని స్విచఆ్‌ఫ చేసుకొని ఇంట్లో తెలియకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి వెతికినప్పటికీ ఎక్కడా దొరక్కపోవడంతో భార్య పవిత్ర తిప్పర్తి పోలీస్‌ స్టేషనలో గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ రాంమూర్తి తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:51 PM