సూర్యాపేటలో మరో చైన్ లింక్ యాప్ మోసం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:56 AM
సూర్యాపేటక్రైం, అక్టోబరు 24: చైన్ లింక్ యాప్ ద్వారా అధిక డబ్బుల వస్తాయని ఆశపడి కొందరువ్యక్తులు నిలు వునా మునిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన సంస్థగా చెబు తూ నిరుద్యోగులకు ఉద్యోగాలం టూ ఓవ్యక్తి ఆర్జీఏ పేరుతో జూలైలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంస్థ కార్యాలయా న్ని ప్రారంభించాడు.

సూర్యాపేటక్రైం, అక్టోబరు 24: చైన్ లింక్ యాప్ ద్వారా అధిక డబ్బుల వస్తాయని ఆశపడి కొందరువ్యక్తులు నిలు వునా మునిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన సంస్థగా చెబు తూ నిరుద్యోగులకు ఉద్యోగాలం టూ ఓవ్యక్తి ఆర్జీఏ పేరుతో జూలైలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంస్థ కార్యాలయా న్ని ప్రారంభించాడు. అనంతరం అవగాహన సదస్సులు పెడుతూ వచ్చిన బాధి తుల నుంచి రూ.1,800 కట్టించుకోవడమే కాకుం డా వారు మరికొంత మందితో డబ్బులు కట్టించేలా జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తులు మధ్యవర్తులుగా నియమించుకున్నాడు. వీరి ద్వారా ఈ సంస్థల్లో రూ. 1,800 కట్టి సభ్యత్వం తీసుకుంటే యాప్ ఇచ్చి ప్రతిరోజు4 నుంచి 5 యాడ్లను పంపిస్తూ వాటిని చూసిన వారికి ప్రతి రోజు రూ.60లను యాప్లో జమ చేస్తుంటారు. ఇలా రూ. 1,800లు కడితే రోజుకు రూ.60, రూ. 4, 500 కడితే రూ.260, అలాగే రూ. 15 వేలు కడితే రూ.540, అదేవిధంగా రూ.45 వేలు కడితే 1,620, లక్ష 20వేలు కడితే రూ.4,650, ప్రతి రోజు వస్తుంటాయి. ఇవేకాకుండా ఒకవ్యక్తి కింద రూ.400 మంది సభ్యులు చేరితే వారికి లక్షరూపాయ ల వేతనంతో పాటు వారు సమావేశాన్ని పెట్టుకునేందుకు అయ్యే ఖర్చును ఇస్తూ వచ్చారు. ఇలా జమ అయిన డబ్బు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించగా మంగళవారం విత్డ్రా కనిపించక పోవడంతో ప్రజ లు భయాందోళనకు గురయ్యారు. సంస్థ ఎత్తేశారని తెలియడంతో కొందరు తమ బంధువులు తెలిసిన వారి వద్దకి డబ్బులు మాది గ్యారెంటీ అంటూ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి లక్షల్లో మోసపోయినట్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల మంది ఉన్న ఆర్జీఏ బాధి తులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈవిషయమై సదరు మోటివేటర్ను బాధితులు నిల దీయగా తాము కూడా మోసపోయామని చెప్పుకొచ్చారు. ఆర్జీఏ బాధితులు ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా సూర్యాపేట పోలీస్ స్టేషన్కు వస్తున్నారు. పోలీసులు సదరు మధ్యవర్తిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది.