గుండెపోటుతో అంగనవాడీ టీచర్ మృతి
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:29 AM
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఎం.మల్లేపల్లికి చెందిన అంగనవాడీ టీచర్ వైద్యుల వసంతలక్ష్మి(55) గుండెపోటుతో సోమవారం మృతి చెందింది. ఉదయం ఇంట్లో అకస్మాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు.
![గుండెపోటుతో అంగనవాడీ టీచర్ మృతి](https://media.andhrajyothy.com/media/2023/20231205/16dvkp12_e39d4e0900.jpg)
చింతపల్లి, జనవరి 16 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఎం.మల్లేపల్లికి చెందిన అంగనవాడీ టీచర్ వైద్యుల వసంతలక్ష్మి(55) గుండెపోటుతో సోమవారం మృతి చెందింది. ఉదయం ఇంట్లో అకస్మాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. స్థానిక వైద్యులకు చూపించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. 20 ఏళ్లుగా ఎం.మల్లేపల్లి గ్రామ అంగనవాడీ టీచర్గా పనిచేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం ఐసీడీఎస్ ద్వారా రూ.20వేల నగదును ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులకు అందజేశారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వసంతలక్ష్మీ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు వంగాల ప్రతా్పరెడ్డి, ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ తదితరులు ఉన్నారు.