Share News

manchiryala- పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:18 PM

ముత్యంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల 2009-10లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం పాఠశాలలో నిర్వహించారు. పాఠశాలలోని అనుభూతులను - జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు.

manchiryala- పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

కాసిపేట, జూలై 28: ముత్యంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల 2009-10లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం పాఠశాలలో నిర్వహించారు. పాఠశాలలోని అనుభూతులను - జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తమ స్నేహితులను, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను చూసేందుకు తరలివచ్చారు. పరస్పరం ఆలింగనం చేసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులకు జ్ఞాపికలను బహూకరించారు. ఇది 24 ఏళ్ల బంధమని, తమ స్నేహితులను కలవాలన్న సదుద్దేశంతో ఈ సమ్మేళనాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా. ఆనాడు తమకు పాఠాలు బోధించిన గురువులను సన్మానించారు.

Updated Date - Jul 28 , 2024 | 11:18 PM