Share News

ACB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పురపాలిక అధికారులు

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:32 PM

లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి ఇద్దరు పురపాలిక అధికారులు చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణానికి చెందిన శివ ఇంటి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.

ACB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పురపాలిక అధికారులు

సంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి ఇద్దరు పురపాలిక అధికారులు చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణానికి చెందిన శివ ఇంటి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.

ఇందుకోసం ఆర్ఐ వెంకట రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణు గోపాల శర్మ రూ.10 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు శివ ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Updated Date - Jan 17 , 2024 | 08:34 PM