అప్పులబాధతో యువకుడి బలవన్మరణం
ABN , Publish Date - Feb 12 , 2024 | 12:19 AM
అప్పలబాధ తట్టుకోలేక ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం జరిగింది.
![అప్పులబాధతో యువకుడి బలవన్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అప్పులబాధతో యువకుడి బలవన్మరణం
మిర్యాలగూడ అర్బన, ఫిబ్రవరి 11: అప్పలబాధ తట్టుకోలేక ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన గడ్డం మహేష్ (24) తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చి చూసే వరకు తన కుమారుడు విగతజీవిగా మారడాన్ని చూసి బోరుమన్నారు. అవివాహితుడైన మహేష్ తన వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులను తీర్చలేక మానసికంగా కుంగిపోయి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై తమకు ఎ లాం టి ఫిర్యాదు అందలేదని టూటౌన పోలీసులు తెలిపారు.