Share News

ఆడిస్తానంటూ తీసుకెళ్లి.. రెండేళ్ల బాలికపై అత్యాచారం

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:55 AM

అతడు పొరుగున ఉండే యువకుడు. పైగా పరిచయస్తుడు కూడా. రోజూ ఇంటికొచ్చి రెండేళ్ల పాపను ఎత్తుకొని ఆడిస్తుంటాడు. ఆ రోజూ వచ్చి పాపను కాసేపు ఆడించి తీసుకొస్తాని చెబితే ఆ తల్లి ఎందుకు అనుమానిస్తుంది? అయితే ఆ యువకుడు దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాలికను ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి

ఆడిస్తానంటూ తీసుకెళ్లి.. రెండేళ్ల బాలికపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం

నిలోఫర్‌లో చిన్నారి.. పరిస్థితి విషమం

పోలీసుల అదుపులో నిందితుడు

చౌటుప్పల్‌ రూరల్‌, మార్చి 26: అతడు పొరుగున ఉండే యువకుడు. పైగా పరిచయస్తుడు కూడా. రోజూ ఇంటికొచ్చి రెండేళ్ల పాపను ఎత్తుకొని ఆడిస్తుంటాడు. ఆ రోజూ వచ్చి పాపను కాసేపు ఆడించి తీసుకొస్తాని చెబితే ఆ తల్లి ఎందుకు అనుమానిస్తుంది? అయితే ఆ యువకుడు దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాలికను ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. కాసేపటికి ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారికి రక్తస్రావం అవుతుండటంతో తల్లిదండ్రులు గుర్తించి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఈ ఘటన జరిగింది. బాలికను హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉంది. సీఐ అశోక్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన 22 ఏళ్ల శివ దండుమల్కాపురంలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే పరిశ్రమకు చెందిన ఓ గదిలో ఉంటున్నాడు. యూపీలో శివ గ్రామానికే చెందిన దంపతులు అదే పరిశ్రమలో పనిచేస్తూ అక్కడే గదిలో ఉంటున్నారు. శివ రోజూ ఆ దంపతుల రెండేళ్ల బాలికను ఎత్తుకొని ఆడించేవాడు. సోమవారం సాయంత్రం చిన్నారిని ఎత్తుకొని ఆడిపిస్తానని తల్లికి చెప్పి పరిశ్రమ సమీపంలోని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత పాపను ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. ఏడుస్తూ వచ్చిన చిన్నారిని చూసి తల్లి కంగారుపడింది. కుమార్తె అత్యాచారానికి గురైనట్లు తెలుసుకొని భర్తకు సమాచారమిచ్చింది. ఘటనపై మంగళవారం తెల్లవారుజామున దంపతులు, పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 09:47 AM