లారీ ఢీకొని గొర్రెల కాపరికి గాయాలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:59 PM
లారీ ఢీకొని గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. రెండు గొర్రెలు మృతిచెందాయి.

గుండాల, ఏప్రిల్ 3: లారీ ఢీకొని గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. రెండు గొర్రెలు మృతిచెందాయి. ఎస్ఐ యాకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాచిల్ల గ్రామానికి చెందిన ఎలగందుల సైదులు తన గొర్రెల మందను బుధవారం సాయంత్రం ఇంటికి తోలుకొస్తుండగా మోత్కూరు నుంచి గుండాల వైపు వస్తున్న ధాన్యంలారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గొర్రెలు మృతి చెందాయి. దీంతో గాయపడిన సైదులును 108ద్వారా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకవెళ్లారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాకన్న తెలిపారు.