Share News

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:13 AM

కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చింతపల్లి మండలంలోని కుర్మేడు గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుం ది.

 కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
స్రవంతి (ఫైల్‌ ఫొటో)

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

చింతపల్లి, ఫిబ్రవరి 29: కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చింతపల్లి మండలంలోని కుర్మేడు గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుం ది. చింతపల్లి ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం... కు ర్మేడు గ్రామానికి చెం దిన కల్వకొల్లు అనిల్‌రెడ్డి స్రవంతి దంపతులు. అనిల్‌రెడ్డి కుర్మేడు ఎక్స్‌రోడ్డుపై మెడికల్‌ షా పు నిర్వహిస్తుండగా స్రవంతి (28) మండలంలోని వీటీనగర్‌లో గల ఓ ప్రై వేట్‌ ఆసుపత్రి లో పనిచేస్తుంది. కొన్ని రోజులుగా స్రవంతికి కడుపునొప్పి రావడంతో ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆరోగ్యం బాగుకాలేదు. బుధవారం యథావిధిగా అనిల్‌రెడ్డి మెడికల్‌ షాపుకు వెళ్లగా స్రవంతి వీటీనగర్‌లోని ఆస్పత్రి డ్యూటీ నిమిత్తం వెళ్లింది. బుధవారం రాత్రి స్రవంతి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త అనిల్‌రెడ్డి ఇంటికి వచ్చి చూసే వరకు స్రవంతి చూసి లబోదిబోమన్నాడు. స్థానికుల సహాయంతో వీటీనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించా రు. మృతురాలికి భర్త అనిల్‌రెడ్డి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గురువారం మృ తురాలి తల్లి సూర్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ యాదయ్య తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 12:13 AM