Share News

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:37 PM

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ రెడ్డి ఎంపిక కావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్‌ రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు, కార్యకర్తలు

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), జనవరి 28 : భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ రెడ్డి ఎంపిక కావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో శ్రీనివాస్‌ రెడ్డికి మెమెంటోను అందించి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పద్మజారెడ్డి, పడాకుల బాలరాజు, సాహితీరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ అంజయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, రాజేందర్‌ రెడ్డి, హరిక్రుష్ణ, కిష్ట్యానాయక్‌ ఉన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:37 PM