రోడ్డెక్కిన రైలు
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:14 PM
లారీపై రైలు పరుగెడుతుందని అనుకుంటున్నారా... లేక రైలుబోగి రోడ్కెక్కడమేంటని అనుకుంటున్నారా.. అదేనండి...
మేడ్చల్టౌన్, జనవరి 30 : లారీపై రైలు పరుగెడుతుందని అనుకుంటున్నారా... లేక రైలుబోగి రోడ్కెక్కడమేంటని అనుకుంటున్నారా.. అదేనండి... మేడ్చల్ పట్టణంలోని 44వ నంబరుజాతీయ రహదారిపై ఓ పెద్ద లారీ ఎంఎంటీఎస్ రైలు బోగీలను తీసుకుని నగరం వైపు వెళ్తుంది. ఈ కమ్రంలో మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామ సమీపంలో ఆగింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు, చుట్టు ప్రక్కల వారు లారీ ఎక్కిన రైలుబోగిలను చూసి సంబరపడి సెల్ఫీలు దిగారు.