హజీపల్లిని సందర్శించిన వివిధ రాష్ట్రాల బృందం
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:33 PM
సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించి దేశ స్థాయిలో నిర్మల్ గ్రామ పురస్కారం అందుకున్న ఫరూఖ్నగర్ మండలం హజీపల్లి గ్రామాన్ని బుధవారం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల బృందం సభ్యులు బుధవారం సందర్శించారు.
షాద్నగర్రూరల్, పిబ్రవరి7: సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించి దేశ స్థాయిలో నిర్మల్ గ్రామ పురస్కారం అందుకున్న ఫరూఖ్నగర్ మండలం హజీపల్లి గ్రామాన్ని బుధవారం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో శిక్షణ నిమిత్తం వచ్చిన బృందం సభ్యులు గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి గురించి పంచాయతీ కార్యదర్శి నందినిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలో సమావేశమై చర్చించారు.