మహిళ అదృశ్యంపై కేసు నమోదు
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:55 PM
మహిళ అదృశ్యంపై కేసు నమోదు చే సినట్లు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు.
మహిళ అదృశ్యంపై కేసు నమోదు
నార్కట్పల్లి, మార్చి 28: మహిళ అదృశ్యంపై కేసు నమోదు చే సినట్లు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. భువనగిరి-యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బీ.తుర్కపల్లి గ్రా మానికి చెందిన దేవరపల్లి పూజిత తన సుమారు రెండేళ్ల వయసు గల బాబును తీసుకుని నార్కట్పల్లి మండలం అమ్మనబోలులో ఉం టున్న తన అత్తమామల ఇంటికి ఈ నెల 26న వచ్చింది. బాబుకు పండ్లు తీసుకువస్తానని అత్తమామలకు చెప్పి కుమారుడిని ఇంట్లోనే వదిలి బయటికి వెళ్లిన పూజిత తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో ఇతర తెలిసిన వాళ్ల నుంచి పూజిత గురించి ఆరా తీసినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పూజిత భర్త దేవరపల్లి వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు.