Share News

మాధవీలతపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:48 AM

హైదరాబాద్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ప్రచారంలో ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ‘ఫస్ట్‌ లాన్సర్‌’

మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్/ అఫ్జల్‌గంజ్‌: హైదరాబాద్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ప్రచారంలో ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ‘ఫస్ట్‌ లాన్సర్‌’ సంస్థకు చెందిన ఇమ్రాన్‌ షేక్‌ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగంబజార్‌ పోలీసులు తెలిపారు. ‘ఈనెల 17న సిద్ధి అంబర్‌ బజార్‌ వద్ద మాధవీలత ఓ మసీదుపై బాణం ఎక్కుపెట్టి వదులుతున్నట్లు అభినయించారు. ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే’నని ఇమ్రాన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Apr 22 , 2024 | 10:55 AM