Share News

ఓటర్ల కోసం 2,500 ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - May 09 , 2024 | 05:24 AM

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఓటర్ల కోసం టీఎ్‌సఆర్టీసీ 2,500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మే 13న పోలింగ్‌ ఉండగా..

ఓటర్ల కోసం 2,500 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఓటర్ల కోసం టీఎ్‌సఆర్టీసీ 2,500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మే 13న పోలింగ్‌ ఉండగా.. 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు ఉండటంతో ముందుగానే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం (10వ తేదీ) నుంచే ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు. మే10న 500, 11న 750, 12న 750, 13న 500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 08:25 AM