Share News

104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:28 PM

04 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐ టీయూ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.

104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మీకి వినతి పత్రం అందజేస్తున్న 104 ఉద్యోగులు

కందనూలు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐ టీయూ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల సంఘం అధ్యక్షు డు సాయిరాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులందరూ కూడా బకాయి వేతనా ల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో అనే క సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చిన నేప థ్యంలో డిసెంబరు 4న జీవో నెంబరు ఆర్‌టీ నెంబరు 706 విడుదల చేస్తూ 12కోట్ల 56లక్షల రూపాయలు విడుద ల చేసిందని, కానీ నేటి వరకు 104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేద న్నారు. దీనివల్ల 104 ఉద్యోగుల కు టుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత క ల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కా ర్యక్రమంలో యాదగిరి, చెన్నయ్య, రామకృష్ణ, శ్రీను, సురేష్‌, అలేఖ్య, మాజీ నాగయ్య, పరవి బాలరాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:28 PM