Share News

ఇప్పట్లో రిటైర్‌ కాను: రోహిత్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 02:16 AM

మరో రెండు, మూడేళ్లు కచ్చితంగా క్రికెట్‌ ఆడతానని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. 2025 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌తో పాటు, 2027 వన్డే వరల్డ్‌క్‌పలోనూ ఆడాలనుందని తెలిపాడు...

ఇప్పట్లో రిటైర్‌ కాను: రోహిత్‌

ఇప్పట్లో రిటైర్‌ కాను: రోహిత్‌

న్యూఢిల్లీ: మరో రెండు, మూడేళ్లు కచ్చితంగా క్రికెట్‌ ఆడతానని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. 2025 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌తో పాటు, 2027 వన్డే వరల్డ్‌క్‌పలోనూ ఆడాలనుందని తెలిపాడు. ‘ప్రస్తుతం నా ఆటతీరు మెరుగ్గానే ఉంది. అందుకే మరికొన్నాళ్లు కొనసాగాలనుకుంటున్నా. నా దృష్టిలో వన్డే వరల్డ్‌కప్‌ అసలైన టోర్నీ. మేమంతా 50 ఓవర్ల ఫార్మాట్‌ను చూసే పెరిగాం. అందుకే గతేడాది ఆ మెగా టోర్నీని గెలవాలని భావించాం. ఫైనల్‌ వరకు అంతా సవ్యంగా సాగినా తుది మెట్టుపై బోల్తా పడ్డాం. ఎందుకిలా జరిగిందని ఆలోచించాం. అయితే ఫైనల్లో మా ఆటతీరు బాలేదని చెప్పలేం. ఆసీస్‌ మాకన్నా కాస్త మెరుగ్గా ఆడిందంతే’ అని రోహిత్‌ ఓ చాట్‌షోలో చెప్పాడు.

Updated Date - Apr 13 , 2024 | 02:16 AM