సాత్విక్ జోడీ టైటిల్ నిలబెట్టుకునేనా..?
ABN , Publish Date - Jun 04 , 2024 | 04:56 AM
వచ్చే నెలలో ఒలింపిక్స్..ఈనేపథ్యంలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి నిలకడైన ఫామ్ను కొనసాగించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది..
![సాత్విక్ జోడీ టైటిల్ నిలబెట్టుకునేనా..?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నేటినుంచి ఇండోనేసియా ఓపెన్
జకార్త: వచ్చే నెలలో ఒలింపిక్స్..ఈనేపథ్యంలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి నిలకడైన ఫామ్ను కొనసాగించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఇక్కడ మొదలయ్యే ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. నిరుడు ఇక్కడ విజేతగా నిలిచిన సాత్విక్/చిరాగ్ సూపర్ 1000 టైటిల్ అందుకున్న తొలి భారత డబుల్స్ జోడీగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈసారి ఆరంభ మ్యాచ్లో వీ చాంగ్/కీ వున్ (మలేసియా) ద్వయంతో సాత్విక్ జంట తలపడనుంది. సింగిల్స్లో తైపీకి చెందిన వెన్ చీ స్యూతో సింధు, కెంటా సునయామాతో లక్ష్యసేన్, రజావత్తో ప్రణయ్ తొలి రౌండ్ ఆడనున్నారు. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జ్ కూడా బరిలో ఉన్నారు. డబుల్స్లో తనీషా/అశ్విని, గాయత్రి/ట్రీసా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.