అవి నకిలీ టోర్నీలు
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:09 AM
వేటుపడిన భారత రెజ్లింగ్ సంఘం (డబ్ల్యూఎ్ఫఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ నకిలీ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాడని ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ ఆరోపించింది.
![అవి నకిలీ టోర్నీలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపణ
న్యూఢిల్లీ: వేటుపడిన భారత రెజ్లింగ్ సంఘం (డబ్ల్యూఎ్ఫఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ నకిలీ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాడని ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ ఆరోపించింది. చట్టవ్యతిరేకంగా జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్స్ నిర్వహించి.. ఆటగాళ్లకు నకిలీ సర్టిఫికెట్లు ప్రదానం చేశాడని ఎక్స్లో పోస్టు చేసింది. వీటి వల్ల ఆటగాళ్లకు భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని చెప్పింది. దీనిపై క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ దృష్టి సారించాలని కోరింది. స్పోర్ట్స్ కోడ్ ఉల్లంఘన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎ్ఫఐ కార్యవర్గాన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.