ట్రోఫీని పంచుకున్నారు
ABN , Publish Date - Jan 11 , 2024 | 03:14 AM
మూడుదేశాల అండర్-19 వన్డే టోర్నమెంట్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. బుధవారం ఈ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్, వర్షం కారణంగా రద్దయింది...
![ట్రోఫీని పంచుకున్నారు](https://media.andhrajyothy.com/media/2023/20231205/Untitled_1_53b489a34b.jpg)
సంయుక్త విజేతలు భారత్, దక్షిణాఫ్రికా
వర్షంతో ముక్కోణపు సిరీస్ ఫైనల్ రద్దు
జొహాన్నె్సబర్గ్: మూడుదేశాల అండర్-19 వన్డే టోర్నమెంట్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. బుధవారం ఈ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్, వర్షం కారణంగా రద్దయింది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిద్దామని రెఫరీలు వేచి చూసినా, చివరికి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. లీగ్ మ్యాచ్ల్లో భారత్ ఆడిన నాలుగింట్లోనూ నెగ్గి, నాకౌట్కు చేరడం తెలిసిందే. ఇక, టీమిండియా ఇప్పుడు తన దృష్టి ఈనెల 19 నుంచి జరగనున్న అండర్-19 వరల్డ్క్పపైకి మరల్చింది.